బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై డీకే అరుణ సంచలన ప్రకటన

-

బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై డీకే అరుణ సంచలన ప్రకటన చేశారు. అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. గద్వాల జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ మేధావుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ A.V.N రెడ్డి గారితో కలిసి పాల్గొని డీకే అరుణ ప్రసంగించడం జరిగింది.

DK Aruna's sensational statement on the announcement of BJP candidates
DK Aruna’s sensational statement on the announcement of BJP candidates

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ…. కెసిఆర్ ప్రభుత్వం మాయమాటలతో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూనే ఉందని ఫైర్‌ అయ్యారు. అవినీతి సొమ్ముతో కల్వకుంట్ల కుటుంబాన్ని రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కెసిఆర్ పనిచేస్తున్నాడు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడు ఆలోచించడం లేదన్నారు.

ఉపాధ్యాయుల బదిలీల నుండి ఉద్యోగులకు పిఆర్సి అమలు వరకు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ నుండి విద్యార్థులకు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ మంజూరు వరకు ప్రతి విషయంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. తెలంగాణలోని ప్రతి వర్గానికి న్యాయం జరగాలంటే కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగి బిజెపి ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాల్సిందే. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఈసారి బిజెపికి మద్దతుగా నిలబడాలని మనస్పూర్తిగా విన్నవిస్తున్నానని వివరించారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news