పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు – భట్టి విక్రమార్కకు గుత్తా సలహా

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సలహా ఇచ్చారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుత్తా సుఖందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని బట్టి విక్రమార్కకి గుత్తా సలహా ఇచ్చారు. బట్టి ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్టు..? అని ప్రశ్నించారు.

ఆయనది గమనం, గమ్యం లేని పాదయాత్ర అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు నల్గొండ క్లాక్ టవర్ వద్ద సభ పెడితే అట్టర్ ఫ్లాప్ అయింది అన్నారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ మతిస్థిమితం లేని నాయకుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చిన్నాభిన్నం చేయాలని కేంద్రం చూస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version