Telangana: మే మొదటి వారంలో దోస్త్ షెడ్యూల్!

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. దోస్త్ నోటిఫికేషన్ కు ముహూర్తం ఖరారు అయింది. మే మొదటి వారంలో దోస్త్ షెడ్యూల్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ షెడ్యూల్ పై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

మే మొదటి వారంలో దోస్త్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దోస్త్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. ఈ ఏడాది దోస్త్ దరఖాస్తు చేసుకునే వారు నోటిఫికేషన్ రాగానే… దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ సంవత్సరం 136 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిపి 1000 కి పైగా కాలేజీలు దోస్త్ పరిధిలో ప్రవేశాలు కల్పించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news