బొత్సకు ఎర్రోళ్ల శ్రీనివాస్ వార్నింగ్‌..మీరు మగాళ్లు అయితే !

-

బొత్స సత్యనారాయణకు ఎర్రోళ్ల శ్రీనివాస్ వార్నింగ్‌..ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంపై మాట్లాడినప్పుడు కొంచమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బొత్స సత్యనారాయణకు హెచ్చరికలు జారీ చేశారు. మీరు మగాళ్ళు అయితే వారాంతంకు హైదరాబాద్ రాకుండా ఉంటారా అంటూ నిలదీశారు.

మీకు చీము నెత్తురు ఉంటె మీ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉందో చెప్తారా…ఆ దమ్ముందా నీకు? అంటూ ఫైర్‌ అయ్యారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంపై దండయాత్ర చేసి దోచుకున్నది మీరు, మా ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకున్నది మీరు… తెలంగాణ రాష్ట్రం పై మీకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఇలానే మాట్లాడితే నిన్ను హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగనివ్వం జాగ్రత్త? అని హెచ్చరించారు. తెలంగాణ సమాజంపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు జాగ్రత్త బిడ్డా అంటూ బొత్స సత్యనారాయణ కు వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news