గవర్నర్లు బీజేపీ కండువా వేసుకోవాలి – అసదుద్దీన్ ఓవైసీ

-

గవర్నర్లు బీజేపీ కండువా వేసుకోవాలని ఫైర్‌ అయ్యారు అసదుద్దీన్ ఓవైసీ. యూసీసీ దేశ సమగ్రతను దెబ్బ తీస్తుందని… స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది.. ఇతర యాక్ట్స్ ఉన్నాయి కదా అంటూ ఫైర్‌ అయ్యారు. ముస్లింలను టార్గెట్ చేసి మాత్రమే యూసీసీ తెస్తున్నారని ఆగ్రహించారు.

యూనిఫామ్ అండ్ కామన్ లా కి తేడా ఉందని.. గవర్నర్స్ రాజ్యాంగం కోసం కాకుండా బిజెపి కోసం పని చేస్తే.. బీజేపీ కండువా వేసుకోవాలని చురకలు అంటించారు. గత తొమ్మిది ఏళ్ల నుంచి దేశంలో ఎన్ని ఉద్యోగాల ఇచ్చారు..ముస్లిం యువకులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు.లోక్ సభ ఎలక్షన్స్ కు ముందు UCCని పొలిటికల్ ఎక్సర్సైజ్ లాగ బీజేపీ యూజ్ చేస్తుంది.. గతంలోనూ ఎలక్షన్స్ కు ముందు కొన్ని సంఘటనలను.. అంశాలను చూశామన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా యూసీసీ బిల్ ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news