హైడ్రా అంటే ఓ డ్రామా..పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం – ఈటల హెచ్చరిక

-

హైడ్రా అంటే ఓ డ్రామా..పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ఒక మంత్రిగానో, 5 ఎల్లా పాటు సరైన ఎంపీ గానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డి పేదోళ్ల బాధ తెలిసేదని చురకలు అంటించారు ఈటల. బఫర్ జోన్ లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్ల కు నోటీస్ లు ఎలా ఇస్తారని ఆగ్రహించారు.

Etala Challenge To Revanth Reddy

రేవంత్ రెడ్డి ఇప్పడేదో కొత్తగా ఉద్దరిస్తున్నరంటూ నాగేశ్వర్ రావు లాంటి విశ్లేషకులు పోగడడాం సరైనది కాదని ఆగ్రహించారు. పేదోళ్ల జోలికి వస్తే మేము ఊరుకొము, ఖబర్దార్ అంటు హెచ్చరించారు ఎంపీ ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ హస్మత్ పెట్ చెరువు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు నోటీసులు రెవెన్యూ శాఖ జారీ చేసిందని.. కన్నీళ్లు పెడుతూ ఈటల రాజేందర్ కు పరిస్థితిని వివరించారు నిరుపేదలు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇల్లు కూల్చాలని చూస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు ఈటల.

Read more RELATED
Recommended to you

Latest news