కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అద్భుతమైన వరం : ఈటల రాజేందర్

-

etala rajendhar about kaleshwaram project:  కాలేశ్వరం ప్రాజెక్టుపై బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన వరం అంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఈటల రాజేందర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల రాజేందర్ ను సదరు యాంకర్ ప్రశ్నలు అడగ్గా… ఆ ప్రాజెక్టు అవసరాల గురించి.. వెల్లడించారు ఈటల.

etela-rajender
etala rajendhar about kaleshwaram project

కాలేశ్వరం వల్ల తెలంగాణలో ఏకో బ్యాలెన్స్ జరుగుతుందన్నారు. వందకు వందశాతం.. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఎస్సారెస్పీకి 100% ఆయకట్టుకు వచ్చిందంటే కారణం కాలేశ్వరం అని వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయని గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిందని.. ఎండాకాలంలో కూడా చెరువులో నిండాయని స్పష్టం చేశారు బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news