Telangana: వడ్ల కుప్పపైనే కుప్పకూలి ప్రాణాలు వదిలిన రైతు

-

వడ్ల కుప్పపైనే కుప్పకూలి ప్రాణాలు వదిలారు రైతు. ఈ సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన నేరెండ్ల యాదాగౌడ్ అనే రైతు వడ్లు అమ్మడానికి వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లగా, తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయలేదు.

farmar died in telangana state

దీంతో వారం రోజుల నుండి వడ్లను ఆర పెడుతున్నాడు. శుక్ర వారం వర్షం వచ్చేలా ఉందని వడ్లను కుప్పలా చేసి కుప్పపై కవర్ వేస్తూ అలానే కుప్పకూలాడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news