మహబూబ్ నగర్ లో ఘోర ప్రమాదం..బస్సు బోల్తా, 17 మంది ప్రయాణికులు

-

మహబూబ్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కొట్టడంతో… 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో Nh 44 పై వాల్వో బస్సు బోల్తా కొట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Fatal accident in Mahbubnagar

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న TS 39 TJ 5191 ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు…. అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు బోల్తా పడిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరికీ గాయాలు అయినట్లు సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news