డ్రగ్ మాఫియా ఫోన్లలో సినీ తారల చిట్టా.. త్వరలోనే వారికి నోటీసులు

-

డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. వరుస అరెస్టులతో డ్రగ్ డీలర్లకు వణుకు పుట్టిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ప్రధాన సూత్రధారుల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిలో నగర వ్యాపారులతోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినీతారలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ (హెచ్‌న్యూ) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటయ్యాక నగరానికి చేరుతున్న మాదకద్రవ్యాల మార్గాలపై నిఘా ఉంచారు. గోవా కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రీతీష్‌ నారాయణ్ బోర్కర్‌, జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, తుకారాం, ఎడ్విన్‌న్యూన్స్‌, బాలమురుగన్‌, హేమంత్‌ అగర్వాల్‌, వికాస్‌నాయక్‌, సంజ గోవెకర్‌, రమేష్‌చౌహాన్‌ వంటి డ్రగ్‌ కింగ్‌పిన్‌లను అరెస్ట్‌ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో సుమారు 7,000-8,000 మంది డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారి వివరాలున్నట్టు గుర్తించారు. వీరిలో 400 మందికి 41ఎ సీఆర్‌పీసీ నోటీసులు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version