APSRTC బస్సులో మంటలు ..ఏకంగా 16 మంది!

-

ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి బస్సు పూర్తిగా దగ్ధమై…. 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన… ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా… బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి బస్సు డీసీఎంను ఢీ కొట్టింది.

Fire in APSRTC bus 16 people alone

దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ తరుణంలోనే డ్రైవర్ తో పాటు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే స్థానికులు… వెంటనే అలర్ట్ అయి… వారిని కాపాడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం… ఆ 16 మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news