వారేమి ఆయన లాగ పారాచూట్ నేతలు కాదు .. కాంగ్రెస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

-

ప్రజాసమస్యలను కాంగ్రెస్ పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. వారికి కావాలంటే కేసీఆర్, కేటీఆర్‌ను తమ పార్టీలో చేర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెబుతున్నామని అన్నారు.నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రులు బండి సంజయ్‌,కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

వారేమి చామల కిరణ్‌లాగా పారాచూట్ నేతలు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు అంచలంచెలుగా ఎదిగి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై పోరాటంతో పైకి వచ్చారని అన్నారు .తమ పార్టీలోకి ఎవరు వచ్చిన రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో కొట్లాడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించినా దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గౌరవించట్లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఇదే తరహాలో వ్యవహరించి ఇప్పుడు ఎక్కడ ఉందో చూస్తున్నామని ,ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news