తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొట్టడంతో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

car accident

మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version