బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్…40 మంది విద్యార్థులకు అస్వస్థత

-

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థినీల‌ అస్వస్థత (ఫుడ్ పాయిజ‌న్) ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. వెంటనే సంబంధిత అధికారులను విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలంటూ మంత్రి ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి.. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాల‌న్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఘటన జరిగినప్పటి నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా విద్యార్థినీల పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ అప్రమత్తం చేస్తున్నారు. మెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసిన మంత్రి, విద్యార్థులు పూర్తి స్థాయిలో కొలుకునే వరకు బాలికల వసతి గృహంలో మెడికల్ క్యాంపు ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news