వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి పోటీ చేస్తా – మాజీ మంత్రి చంద్రశేఖర్

-

వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు మాజీ మంత్రి చంద్రశేఖర్. బీజేపీ వ్యవహారం నచ్చకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశానని.. బండి సంజయ్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు మాజీ మంత్రి చంద్రశేఖర్. ఆయనను అధ్యక్షుడు గా తొలగించడం నాకు నచ్చలేదని అసంతృప్తిని కనబరించారు మాజీ మంత్రి చంద్రశేఖర్.

అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ ఎదిరించట్లేదని.. ఈ మధ్య కాలంలో బీజేపీ లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ బయటకు వస్తారని పేర్కొన్నారు. నేను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. జహీరాబాద్ నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నానన్నారు మాజీ మంత్రి చంద్రశేఖర్. అక్కడ గీతారెడ్డి పోటీ లో లేకుంటే.. ఆమె సహకారంతో నే జహీరాబాద్ బరిలో ఉంటానని వెల్లడించారు. ఈ నెల 18 న కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version