కారుతో BRS మాజీ MLA షకీల్ కుమారుడి భీభత్సం

-

హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఈ కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయారు.

Former MLA Shakeel’s son booked for destroying barricades at Praja Bhavan

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. కేసు తప్పుదోవ పట్టించేందుకు వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

దీనిపై వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాహెల్ పరారీ లో ఉన్నాడు..మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రాహెల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశాము…ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి బిఎమ్ డబ్ల్యూ కార్ ఢీ కొట్టింది..కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news