పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప – నారా లోకేష్‌

-

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ పార్టీ అగ్రనేత నారా లోకేష్‌. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు.

Letter from Rashtrapati Bhavan to Nara Lokesh
TDP nara lokesh about anganvaadies issue

అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఉందన్నారు నారా లోకేష్‌. ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టిడిపి పూర్తి స్థాయి మద్దతు ఇస్తోందని చెప్పారు నారా లోకేష్‌. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నానని తెలిపారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news