మాజీ ప్రిన్సిపాల్ చేతివాటం.. విద్యార్థుల నుంచి 39 లక్షలు వసూలు

-

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కెపల్లి సమీపంలోని హిట్స్ బిఎడ్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ జీవన్ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. యాజమాన్యానికి తెలియకుండా విద్యార్థుల నుండి ఫీజుల పేరుతో డబ్బులు వసూల్ చేశాడు. దాదాపు 39 లక్షలు కాజేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాడు. సర్టిఫికేట్ లు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ జీవన్ అసలు బాగోతం బయటపడింది. దీంతో ప్రిన్సిపల్ ని నిలదీసింది యాజమాన్యం.

దీంతో ప్రిన్సిపల్.. మాజీ ప్రిన్సిపల్ జీవన్ ని నిలదీయడంతో డబ్బులు సెటిల్ మెంట్ చేసేందుకు సమయం అడిగి ఉడాయించాడు ప్రిన్సిపాల్ జీవన్. సర్టిఫికెట్ ల విషయంపై యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు విద్యార్థులు. మొదట సర్టిఫికెట్ ల విషయంలో మొండికేసింది యజమాన్యం. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం మాజీ ప్రిన్సిపాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది కాలేజీ యాజమాన్యం. తమను మోసం చేసిన మాజీ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news