కరీంనగర్‌ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన

-

 

కరీంనగర్ రూరల్ లోని తీగల గుట్టపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేశారు మంత్రి గంగుల కమలాకర్. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓవర్ బిడ్జి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధి లో రైల్వే ట్రాక్ ఉంటె ఖచ్చితంగా ROB ఇవ్వాలన్నారు.

750 మీటర్ల పొడవు తో ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని.. ఏడాది లోగ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. స్థల సేకరణ చేయడం, విద్యుత్ పోల్స్ నిర్మాణం చేయడం అవసరముందని చెప్పారు. కేంద్ర నిధులైనా, తెలంగాణ రాష్ట్ర నిధులైనా ఇవి ప్రజల సొమ్ము అని వెల్లడించారు. రాజకీయ కోణాలు చూడకూండా దయచేసి అభివృద్ధి ని చుడండని కోరారు మంత్రి గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news