BREAKING : సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు

-

సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు జరుగనున్నాయి. హైదరాబాద్ లో జరిగే రెండు ప్రతిష్టాత్మక పండుగల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు హైదరాబాద్ పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పండుగలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు ప్రకటించారు.

రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో పీస్ కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో.. పీఎస్ కమిటీ మిలాద్ ఉన్నబి వాయిదా వేసేందుకు ఒప్పుకున్నారన్నారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. దీంతో భక్తులు 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామమని.. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news