బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మహా టీవీ చిన్న గ్లాస్ పగులుతేనే బాధడుతున్నారు… తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్పై అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి,అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారు… సోషల్ మీడియాలో, మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
మహా టీవీ యాజమాన్యం కేటీఆర్పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసింది… కేటీఆర్తో పాటు వారి కుటుంబసభ్యుల పరువు తీసే విధంగా ప్రసారాలు చేశారని ఆగ్రహించారు. అందరికి తల్లులు, పిల్లలు, కుటుంబసభ్యులు ఉంటారు… సెక్షన్ ఆఫ్ ఆంధ్రా మీడియా పనిగట్టుకుని కేసీఆర్, కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మేము కేసులకు భయపడం, కేటీఆర్పైన, బీఆర్ఎస్ నేతలపైన అసత్య ప్రచారం చేస్తే ప్రతిఘటిస్తాం… మహా న్యూస్పైన బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గెల్లు శ్రీనివాస్.
🔷 బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్ 👇
🔹మహా టీవీ చిన్న గ్లాస్ పగులుతేనే బాధడుతున్నారు
🔹తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్పై అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి… pic.twitter.com/LMBbjFxhOr
— Mission Telangana (@MissionTG) June 28, 2025