కాంగ్రెస్ లోకి వెళ్లడంపై మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి క్లారిటీ

-

కాంగ్రెస్ లోకి వెళ్లడంపై మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.తాజాగా GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ… కాంగ్రెస్ లోనికి రావాలని దీప దాస్ మున్షీ ఆహ్వానించారన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతానని వెల్లడించారు. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటా….రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనుని చెప్పారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

Read more RELATED
Recommended to you

Exit mobile version