తెలంగాణ వాసులకు శుభవార్త. మంత్రి సీతక్క ఉపాధి హామీ పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. రూ. 1800 కోట్లతో ఉపాధి హామీ పనులు మంజూరు అయ్యాయి. అంగన్వాడీలు, గ్రామపంచాయతీ భవనాలకు ఇందులో అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సంవత్సరం 1,440 పంచాయితీ కార్యాలయాలు, 1,400 అంగన్వాడీల నిర్మాణం జరగబోతోంది. నెలవారి లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు చేయాలని అధికారులకు సూచించారు.

ఎంపీడీవోల బదిలీలు, వాహనాల అలవెన్స్ ల ఫైళ్ళకు రెండు రోజుల్లో క్లియరెన్స్ వస్తుంది. ఇతర రాష్ట్రాల విధానాలు అధ్యయనం చేయబోతున్నారు. 15 రోజుల్లో టెండర్లు వేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. ఇదిలా ఉండగా…. తెలంగాణ బాసులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. రైతు భరోసా నిధులను రెండు రోజుల నుంచి విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నిన్నటి వరకు మూడు ఎకరాల భూమి ఉన్నవారి రైతుల నిధులను రిలీజ్ చేసింది. ఇలా తొమ్మిది రోజులపాటు రైతు భరోసా నిధులను వారి అకౌంట్లో జమ చేయనున్నారు.