చెవిరెడ్డికి రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు.. ఎన్ని రోజులంటే ?

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు రిమాండ్ విధించారు. ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించింది ఏసీబీ కోర్టు.

వచ్చే నెల ఒకటో తేదీ తరువాత వరకూ రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు తరలించారు.

కాగా నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news