ఇవాళ్టి నుంచి TS ఆర్టీసీ బస్సులు ఎక్కే వారికి శుభవార్త

-

ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కే వారికి శుభవార్త అందించింది. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టిఎస్ఆర్టిసి ప్రవేశపెట్టిన లక్కీ డ్రా నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.

ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుక పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్ లోని బాక్స్ లో వేయాలి. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి పది మందిని ఎంపిక చేసి…. 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులు ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోందని ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారిక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news