నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్

-

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 15 రోజుల్లోనే 15వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇందిరవెల్లి బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు. తాజాగా 6,956 మంది స్టాప్ నర్స్ లకు ఎల్బీ స్టేడియంలో వారి కుటుంబ సభ్యుల సభ్యుల సమక్షంలో నియామక పత్రాలను అందజేశామని తెలిపారు.

దీంతో స్టాప్ నర్స్ లు ఎంతో సంతోషపడ్డారని తెలిపారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఆదివాసీలకు చేసింది ఏమి లేదన్నారు. ఆదిలాబాద్ వాసులు ఆదివాసి బిడ్డ సోయం బాపురావును  గెలిపించారు. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి సాక్షిగా అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రారంభించాం. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే శంఖారావం చేస్తున్నామని తెలిపారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version