తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదు – మంత్రి సత్యవతి రాథోడ్

-

తెలంగాణ గవర్నర్ గా మూడేళ్ల పదవికాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి సత్యవతి రాథోడ్. గవర్నర్ బిజెపి నాయకురాలిగా మాట్లాడుతోందని మండిపడ్డారు. గవర్నర్ తన పని తాను చూసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్ భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టమని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గవర్నర్ పరిధి దాటి బిజెపి ప్రతినిధిగా ప్రవర్తిస్తోందని అన్నారు.

వరదలు వస్తే ప్రభుత్వం ఉండదా.. మీకు ఎం పని అని వెళ్లారని ప్రశ్నించారు. రాజ్ భవన్ కు ఎవరు వెళ్ళకుంటే ఫోన్లు చేసి మరి పిలిపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని.. అందుకే విమోచన దినం అంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందన్నారు. మీకు మీరే సమీక్ష చేసుకోండి.. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం అవుతుందని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version