దళిత బంధు, గొర్రెల పంపిణీ పథకాలు రద్దు !

-

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జిలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావుల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు ఫైర్‌ అయ్యారు.

ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లేనన్నారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నదని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version