Telangana:ఇవాళే గ్రూప్-1 మెయిన్స్.. మ.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

-

group 1 exams: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి గ్రూప్ వన్ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎన్ని నిరసనలు తెలిపిన కూడా… జీవో 29 రద్దు చేసేది లేదని రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది. ఇవాళ్టి పరీక్షలు కూడా నిర్వహించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

group 1 mains exams, telangana

ప్రభుత్వ పట్టుదల, అభ్యర్థుల ఆందోళనల నడుమ మరి కొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం కానుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం 30 నిమిషాల ముందే పరీక్ష ప్రారంభానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే వారిని పరీక్ష కేంద్రాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే 040-23452185, 040-23452186 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version