గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే ఆ నిధులు విడుదల

-

గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలోని గ్రామపంచాయతీలకు శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే గ్రామపంచాయతీలకు నిధులను భారీగా విడుదల చేస్తామని ప్రకటన చేశారు.

 

కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్లే నిధులు ఆగిపోతున్నాయని ఈ సందర్భంగా కేంద్రంపై నిప్పులు జరిగారు. ఏదేమైనా అతి త్వరలోనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

మునుపెన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని గుర్తు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి దయాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version