పెళ్ళైనా ఆగని ప్రియుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు!

-

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియుని వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుంది అనూష అనే యువతి. ప్రియుడి ఇంటిముందు అమ్మాయి బంధువులు ధర్నా చేపట్టారు. మర్రిపెడ మండలం తానంచర్ల శివారు జెండాల తండాలో ఘటన చోటుచేసుకుంది. అనూష మృతికి ప్రియుడు భూక్యా సురేష్‌ కారణమే అని సూసైడ్‌ నోట్‌లో  రాసి సూసైడ్ చేసుకుంది అనూష.

సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూషను ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు సురేష్‌. ఈ నేపథ్యంలో సురేష్ మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. పెద్దల పంచాయితీలో 2 లక్షల జరిమానా కట్టి అనూషను వదలిపెడుతానని చెప్పాడు సురేష్. పంచాయితీ తర్వాత కూడా అనూషతో బంధం కొనసాగించాడు సురేష్. డబ్బులు, ఆస్తి తీసుకురా పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. సురేష్ వేధింపులు పెరగడంతో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version