మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల మైనంపల్లి ఓడటం ఖాయం – మంత్రి హరీష్ రావు

-

మల్కాజ్‌గిరిని నేను దత్తత తీసుకుంటానని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషికి, మాటలు, ముఠాల మనిషికి మధ్య పోటీ అన్నారు.మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం హెచ్చరించారు. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా..? మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంపిగా ఓడినా ప్రజాసేవ మరచిపోలేదని వెల్లడించారు.

9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. సీఎం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నడు…ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు. కేసీఆర్ ఓట్ల కోసం చెప్పలేదని పేర్కొన్నారు. ప్రతి పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో కరెంట్ కోతలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు… కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ప్రశాంతంగా ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్ గా మారింది… నాడు బెంగాల్ ఆచరిస్తే దేశం అనుసరించేది. నేడు తెలంగాణ మోడల్ అయ్యిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news