Harish Rao to go to BRK Bhavan : తెలంగాణ భవన్కు బయలుదేరారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడి నుండి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు హరీష్ రావు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసం వద్ద హరీష్ రావు మాట్లాడారు. న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. అందుకే కమిషన్ ముందు హాజరవుతున్నాం. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని ప్రకటించారు.

ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాయొద్దని వెళ్లడించారు. అంతిమంగా న్యాయం గెలుస్తది. న్యాయం మీద నమ్మకం ఉంది, దైవం మీద నమ్మకం ఉందన్నారు. మేము ప్రభుత్వంలో లేము, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
🔷 తెలంగాణ భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు
🔷 అక్కడి నుండి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు బీఆర్కే భవన్కు వెళ్లనున్న హరీష్ రావు
ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసం వద్ద హరీష్ రావు కామెంట్స్ 👇
🔹న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం… pic.twitter.com/lFiHyk2xx3
— Mission Telangana (@MissionTG) June 9, 2025