దాడి త‌ర్వాత అఘాయిత్వం చేయ‌బోయాడు- న‌టి చౌరాసియా

-

కేబీఆర్ పార్క్ వ‌ద్ద న‌టి చౌరాసియా పై ఓ వ్య‌క్తి దాడి చేసి , న‌టి సెల్ ఫోన్ దొంగ‌లించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న పై తొలి సారి న‌టి చౌరాసియా స్పందించింది. దాడి చేసిన త‌ర్వాత త‌న పై అఘాయిత్యం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడ‌ని చెప్పింది. స‌మయానికి చుట్టు ప‌క్క‌ల వారు రావ‌డం తో త‌ప్పించు కుని పారిపోయాడ‌ని తెలిపింది. అలాగే ఆ రోజు ఎం జ‌రిగిందే త‌న మాటలలో విందం.. ఆ రోజు నేను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కు వ‌చ్చాను. వాకింగ్ ను పూర్తి చేసిన త‌ర్వాత పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఒక వ్యక్తి నాపై దాడి చేశాడు. అలాగే నా మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవాల‌ని చూసాడు. నేను స్పందించ‌క పోవడం తో నా మొహం పై గుద్దాడు.

నా ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం డబ్బులు లేవు అని చెప్పాను. ఫోన్ పే చేస్తాను నెంబర్ ఇవ్వుమ‌ని అడిగాను. అదే స‌మ‌యంలో100 కి డయల్ చేసాను. అది చూసి నన్ను పొదల్లోకి తోసాడు. అలాగే పెద్ద బండరాయి తలపై వేశాడు. అయితే నేను పక్కకు తప్పుకునున్నాను. అలాగే వాడి ప్ర‌యివేటు పార్ట్ పై తన్నాను. దీంతో వాడి నుంచి త‌ప్పించు కుని రోడ్ పైకి వచ్చాను. దీంతో కొంతమంది నా చుట్టూ వచ్చి చేరారు. అది గమనించి వాడు పారిపోయాడు. పోలీసులు కూడా వ‌చ్చారని ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న వివ‌రించింది. అయితే ఆ దొంగ ను చూస్తే తాను గుర్తు ప‌డుతాన‌ని న‌టి చౌరాసియా తెలిపింది. ఆ దొంగ దాదాపు 22 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉంటాడ‌ని వివ‌రించింది.

Read more RELATED
Recommended to you

Latest news