ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా : గోరంట్ల బుచ్చయ్య

-

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ  రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పిందని, మళ్లీ పోటీ చేసి గెలవడం ఖాయమని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో రాజమండ్రి రూరల్ వెళ్లానని వివరణ ఇచ్చారు.


నాకు ఎక్కడ సీటు ఇచ్చిన గెలిచి తీరుతానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన  రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికార వైసీపీలో టికెట్లు మార్పులు చేర్పులను తీవ్రంగా విమర్శించారు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా అంటూ మంత్రుల స్థానచలనంపై వ్యాఖ్యానించారు. ఈ తప్పు జగన్ దేనని, రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు కూడా జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news