న్యూ ఇయర్ వేడుకల వేళ.. డీజీపీ కీలక ఆదేశాలు..!

-

నూతన సంవత్సర వేడుకలు మరో వారం రోజుల్లో జరుగనున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లతో డీజీపీ రవిగుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు డీజీపీ ఆదేశించారు.


కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా హైదరాబాద్ కు డ్రగ్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో డ్రగ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇక నుంచి ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు జరపాలంటే కాళ్లు వణికిపోవాలని అన్నారు. దీంతో సీఎం ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు డ్రగ్స్ పై అప్రమత్తమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news