తెలంగాణలోని ముంపు గ్రామాలకు హెలికాప్టర్లు పంపండి – సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల 62 సెం.మీల వర్షపాతం, 47 సెం.మీల వర్షం ఇలా భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో పూర్తిగా నీట మునిగింది మోరంచపల్లి గ్రామం. ఆ గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఈ తరుణంలోనే… సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలట్రీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికే మోరంచపల్లికి తరలివెళ్లాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్ కు నివేదిస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇక తెలంగాణలోని ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముంపు గ్రామాలన్నిటికీ.. హెలిక్యాప్టర్లు పంపాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news