గ్రూపు-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు TGPSC కి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత రాఖేష్ రెడ్డి అన్నారు. ధర్మానిదే అంతిమ విజయం అని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది అన్నారు. పోరాడిన అభ్యర్థులది విజయం అని.. అండగా నిలిచిన బీఆర్ఎస్ నైతిక విజయం. పరీక్షల్లో 10 మంది అభ్యర్థులు ఎలా పెరిగారు..? ఇది కూడా సైబర్ నేరమా..? పక్కాగా ఒక ప్యాటర్న్ ప్రకారం.. మార్కులు వేసినట్టు కనిపిస్తోంది.
గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల్లో 21 ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరపాలని ఏనుగుల రాఖేష్ రెడ్డి డిమాండ్ చేశారు.