సండే స్పెషల్.. యాదాద్రికి పోటెత్తిన భక్తులు

-

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈవాళ ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తమ కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చారు. భక్తుల రాకతో దివ్యక్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులకు దాదాపుగా గంటన్నర సమయం పడుతోంది ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయం సందడిగా మారింది. నారసింహుడి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.

ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. వేసవి కావడంతో భక్తులకు ఎండ తాకిడి లేకుండా క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు యాడా అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news