జేఈఈ మెయిన్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

-

జేఈఈ మెయిన్ సెషన్2 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్​కు చెందిన వెంకట్ కౌండిన్య అనే విద్యార్థి 300/300 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. నగరానికి చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి ఆరో ర్యాంక్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు విద్యార్థి లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు, అమలాపురానికి చెందిన సాయినాథ్ శ్రీమంత పదో ర్యాంకులతో సత్తా చాటారు.

ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇవాళ తెల్లవారుజామున విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో https://jeemain.nta.nic.in/లో చూసుకోవచ్చు. తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరిగిన సెషన్‌-2 పరీక్షలకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2).. 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version