బిల్డర్లని బ్లాక్ మెయిల్ చేయడానికే హైడ్రా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

బిల్డర్లని బ్లాక్ మెయిల్ చేయడానికే హైడ్రా తీసుకొచ్చారని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాాజాగా బీఆర్ఎస్ భవన్ లో ఆయన   జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులు పెడుతుందని పేర్కొన్నారు కేటీఆర్.

KTR

మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి ఓ స్పష్టత లేదన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశాం. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 50 ఏళ్ల నుంచి కొంత మంది నివాసం ఉంటున్నారు. గరీబోల్లకు నష్టం కాకుండా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.  బీఆర్ఎస్ కూడా మూసీ సుందరీకరణ చేశామని తెలిపారు. పేదలకు అన్యాయం జరుగకుండా చేశామని తెలిపారు. సివరేజ్ ప్లాంట్స్ పూర్తి అయితే దిగువనకు శుద్ధి చేసిన నీళ్లు వెళ్తాయని తెలిపారు కేటీఆర్. మూసీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రా ను తీసుకొచ్చారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version