తెలంగాణ కోసం పక్షిలా ఒక్కడినే తిరిగాను : సీఎం కేసీఆర్

-

అచ్చంపేట బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 24 ఏళ్ల పొద్దాయే.. తెలంగాణ కోసం బయలుదేరాను. అప్పుడు ఎవ్వడూ లేడు.. కేసీఆర్ నీకు దమ్ముందా..? కోడంగల్ కు రా అని ఒకడు.. గాంధీ బొమ్మ కాడికి రా ఒకడు ఇలా సవాల్ చేస్తున్నారు. ఇది రాజకీయం అనుకోవచ్చా.? రాజకీయం అంటే సవాల్ చేయడం కాదన్నారు. ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతూ ఉంటాయి.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. తెలంగాణ రాక ముందు ఎవడెవడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎలక్షన్లు రాగానే ఆగం ఆగం కావద్దు.. ఏది చెప్పిన వినకండి.. నా వంతు పని నేను చేశాను… ఇప్పుడు మీరు చేయాలి.

తెలంగాణ కోసం పక్షిలా ఒక్కడినే తిరిగాను అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చేది లేదని కొందరూ హేళనగా మాట్లాడారు. పోరాటంలో నిజముంది కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పటివరకు నేను పోరాటం చేశాను.. ఇప్పుడు మీరు చేయాలి. బీజేపీ వాళ్లు వచ్చి మనకు నీతులు చెబుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version