రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ : సీఎం కేసీఆర్

-

అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా రైతు బంధు గురించి, రైతుల గురించి ప్రస్తావించారు.
కేసీఆర్ దమ్ము ఏంటో ఇండియా మొత్తం చూసింది. మీ కళ్లకు కనిపిస్తుంది కేసీఆర్ దమ్ము కాదా..? నవంబర్ 30న మీరంతా దుమ్ము లేపండి. రైతుబంధు కోసం ఎవరైనా ఆలోచించారా..? ఈ ప్రపంచంలో రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ అని వెల్లడించారు.

ఓట్ల కోసం తప్పుడు హామీలను ఇవ్వను. అచ్చంపేట నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పించే బాధ్యత నాదే అన్నారు సీఎం కేసీఆర్. 24 గంటలు కరెంట్ ఇస్తానంటే జానారెడ్డి గజమెత్తు ఎగిరిండు.. ఆ తరువాత బీఆర్ఎస్ తరుపున ప్రచారం చేస్తానన్నారు. అప్పర్ ప్లాట్ లో కూడా నీళ్లు తెప్పిస్తాను. పాలమూరు ఎత్తిపోతల పథకం 190 కేసులను కాంగ్రెస్ పార్టీనే వేసింది. తెలంగాణ కావాలని అడిగితే కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా అన్నారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణీని తీసుకొచ్చానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version