అక్బరుద్దీన్ కొడంగల్‌లో పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తాం: బండి సంజయ్‌

-

అక్బరుద్దీన్ కొడంగల్‌లో పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చిండు లెక్క.. ఇంతకు ముందు అంకులు అంకులు అని కేసీఆర్ పోయిండు కదా.. అన్న పదం వచ్చింది. మొన్నటి దాకా ఎంఐఎం వాళ్లు బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారు. ఎంఐఎం వాళ్లు గోడ మీద పిల్లులు అని.. అధికారంలో ఎవ్వరూ ఉంటే అటు దూకుతారని పేర్కొన్నారు. 
మొన్నటి వరకు కేసీఆర్ చాలా మంచోడు అన్నాడు. వీరిని చెడ్డోల్లు అనేది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. కాంగ్రెస్ లోకి వచ్చారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చుతా అంటే..  నేను దేనికైనా సిద్దం అనాలి. కానీ అనడు. నా వ్యాపారం మంచిగా జరగాలి. నేను చేసిన కబ్జాలు బాగుండాలి. ఎవ్వడూ ట్యాక్స్ లు కట్టొద్దు. కేసులు పెట్టొద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే.. ఇందులో నరికి చంపుతా అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కోడంగల్ లో పోటీ చేస్తా అంటే.. గెలుపు మీదేనా ఏంది అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version