రఘునందన్ పై కేసు నమోదు చేయడం సరైనదే: రేణుకా చౌదరి

-

తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పసి పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఒక రోజే ముగ్గురు మైనర్లపై రేప్ జరిగిందని.. హైదరాబాదులో షీ టీమ్స్ ఎం చేస్తున్నాయని ప్రశ్నించారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేయడం సరైనదే అని తెలిపారు.

బాధితురాలు వివరాలు బయట పెట్టడం అంటే నేరం చేయడమే అని అన్నారు. ఘటన తర్వాత అయిదారు రోజుల పాటు ఇన్నోవా కారు దొరకలేదని.. ఇన్నోవా కార్ లో దొరికిన ఆధారాలు నిజమైనవేనా అని నిలదీశారు. హోం మంత్రి పదవినుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. కాగా జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు కు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయట పెట్టిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news