తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇకపై మహిళా సంఘాలకు డ్రోన్లు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. మహిళా సంఘాలకు నమో డ్రోన్ దీదీ పథకం కింద… 381 డ్రోన్లు అందిస్తామని… సంచలన ప్రకటన చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

రైతులకు ఉపయోగకరమైన అలాగే డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి సబ్సిడీలో ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మార్క్ ఫెడ్ ద్వారా…1.55 లక్షల టన్నుల జొన్నలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే రైతులకు 302 కోట్లు చెల్లించామని వివరించారు. మిగతా బకాయిలు కూడా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.