సింగరేణిలో 327 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

-

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా టెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇలా వరుసగా ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సింగరేణి సంస్థ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏడు కేటగిరీల్లోని ఈ ఉద్యోగాలకు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీఎండీ బలరాం తెలిపారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

భర్తీ చేయనున్న పోస్టులివే..

ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఈఅండ్‌ఎం) ఈ2 గ్రేడ్‌- 42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌) ఈ2 గ్రేడ్‌- 7.

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరు టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(మెకానికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 9, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగిరీ-1- 98.

Read more RELATED
Recommended to you

Latest news