మోదీని గెలిపిస్తే రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం: జేపీ నడ్డా

-

దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మూడోసారి కూడా మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం వస్తుందని తెలిపారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిర కలను సాకారం చేశామని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్‌, వినోద్‌రావును గెలిపించి దిల్లీకి పంపాలని ప్రజలను కోరారు. ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న నడ్డా.. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

‘మా ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయి. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి. గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ 11 నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చారు. రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం. మా పాలనలో 25 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.’ అని జేపీ నడ్డా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news