ముస్లిం లే ఎక్కువ కండోమ్స్ వాడుతారు : ఒవైసీ

-

ముస్లింలను ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్లాలని చూస్తోందని గతవారం మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారని మోదీ అంటున్నారు కానీ, ఎక్కువ మంది కండోమ్‌లు వాడుతారని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో మోదీ ఒక్కరే గ్యారంటీ అని, దళితులు, ముస్లింలను ద్వేషిస్తారని ఒవైసీ మండిపడ్డారు.

‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడతారు, ఇలా చెప్పడానికి నాకు సిగ్గుగా లేదు… ముస్లింలు మెజారిటీ వర్గం అవుతారని నరేంద్ర మోదీ హిందువులలో భయాన్ని పెంచుతున్నారు. ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు కానీ మేము భారతీయులం’ అని ఒవైసీ పునరుద్ఘాటించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ కానీ, ప్రధాని కానీ ఇప్పటి వరకు స్పందించలేదు

Read more RELATED
Recommended to you

Latest news