ఈ నెల 29న తెలంగాణకు జేపీ నడ్డా

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ నెల 29వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. 29వ తేదీన ఉదయం 11:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 12: 10కి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1: 30 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

ఈ సభ ముగించుకుని 2: 20కి హెలికాప్టర్లో మహబూబాబాద్కు చేరుకుని మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ నిర్వహించనున్న మరో సభలో పాల్గొంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి 4: 50కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉప్పల్ కు చేరుకుంటారు. ఉప్పల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా షోలో పాల్గొని రాత్రి 7: 50కి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version